News July 27, 2024
నల్గొండ, సూర్యాపేటను మించిన యాదాద్రి జిల్లా

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. మరోవైపు NLG, SRPT, యాదాద్రి జిల్లాల్లోని ప్రజల్లో సగటు భూమి యాదాద్రిలోనే అత్యధికం కావడం విశేషం. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024లో వెల్లడించింది.
Similar News
News August 5, 2025
NLG: మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే!

విధులకు హాజరు కాకుండానే హాజరయ్యామని ఫేక్ అటెండెన్స్ క్రియేట్ చేసిన పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీరాజ్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సృజన ఆదేశాల మేరకు జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య నోటీసులు జారీచేశారు. మొత్తం జిల్లాలో 69 మంది పంచాయితీ కార్యదర్శులతో పాటు 15 మంది మండల పంచాయతీ అధికారులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
News August 5, 2025
NLG: డుమ్మా కొట్టడం కుదరదిక!

నల్గొండ జిల్లాలో వైద్యులు, సిబ్బంది డుమ్మాలకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 34 పీహెచ్సీలు, 5 యూహెచ్సీలు, 257 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీరందరికీ ముఖ హాజరుకు సంబంధించిన మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News August 5, 2025
NLG: కొబ్బరి కొనలేం.. కొట్టలేం..!

పవిత్ర కార్యక్రమాలు, పూజలలో వినియోగించే కొబ్బరికాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఇళ్లలో, ఆలయాలలో కొబ్బరికాయల వినియోగం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్క కొబ్బరికాయ ధర రూ.50కు పైగా పలుకుతోంది. ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయం వద్ద ఈవో అజమాయిషీ లేకపోవడంతో అధిక ధరలకు అమ్ముతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.