News February 14, 2025
నల్గొండ: 20నాటికి లబ్ధిదారుల జాబితా పూర్తికావాలి: కలెక్టర్ త్రిపాఠి

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆధారంగా అన్ని గ్రామాలలో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఉదయాదీత్య భవన్లో ఎంపీడీవోలతో నమూనా ఇందిరమ్మ గృహాల నిర్మాణం, గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారీ, తదిత అంశాలపై సమీక్షించారు. ఈనెల 20నాటికి అన్ని గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
Similar News
News March 12, 2025
నల్గొండ జిల్లా వాసుల ఎదురుచూపు..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో NLG జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పరిశ్రమలు, మునుగోడులో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల పూర్తి చేయాల్సి ఉంది. కట్టంగూరు మండలం ఆయిటి పాముల ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
News March 12, 2025
నల్గొండ: భర్తను హత్య చేసిన భార్య

ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శివరాం రెడ్డి వివరాలిలా.. ఉస్మాన్పురకు చెందిన అక్సర్ జహ, చర్లగౌరారంలోని ZPHSలో అటెండర్గా పనిచేస్తున్న మహమ్మద్ ఖలీల్ హుస్సేన్ దంపతులు. గత నెల 25న ఖలీల్ హుస్సేన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 7న నిర్వహించిన పోస్టుమార్టంలో మృతుడు హత్యకు గురయ్యాడని తేలడంతో విచారించగా భార్య నేరం ఒప్పుకుంది.
News March 12, 2025
నల్గొండ: గ్రూప్-2లో మనోళ్ల హవా

గ్రూప్-2లో ఉమ్మడి నల్గొండ వాసులు సత్తా చాటారు. కోదాడకు చెందిన వెంకట హరవర్ధన్ రెడ్డి 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మోత్కూరుకు చెందిన సాయికృష్ణారెడ్డి 422.91, రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన సురేశ్ 411.865, పెన్ పహాడ్ మహ్మదాపురానికి చెందిన అన్నదమ్ములు శ్రీరామ్ మధుకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, అతని తమ్ముడు శ్రీరామ్ నవీన్కు 326 ర్యాంకు వచ్చింది.