News May 1, 2024
నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
నల్లగొండ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. మాడ్గులపల్లి మండల కేంద్రంలో రికార్డుస్థాయిలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాంపల్లి మండల కేంద్రంలో 45.9 డిగ్రీలు, చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం జిల్లా అంతటా 41.1 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడం, ఉక్కపోత కారణంగా జనం తల్లడిల్లుతున్నారు.
Similar News
News September 29, 2024
చెన్నారం గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బుగ్గ తండాకు చెందిన భీముడు (23), రమేష్(8)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 29, 2024
NLG: ఎటు చూసినా ధరల మోతే
నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు ముండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోత మోగుతుంది. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.40 నుంచి రూ.60 పలుకుతోంది. జిల్లాలో రైతులు కూరగాయల సాగు వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో కూరగాయలను ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News September 29, 2024
NLG: నల్గొండకు కావాలి హైడ్రా!
నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా అక్రమార్కుల్లో భయం కనిపించడం లేదు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అధికారులు వీటిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.