News July 5, 2024
నల్లగొండ: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 10% రాయితీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720159387467-normal-WIFI.webp)
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి నుంచి తిరుపతి వెళ్లే భక్తులు సూపర్ లగ్జరీ బస్సులలో అప్ అండ్ డౌన్ ఒకే సారి రిజర్వేషన్ చేయించుకుంటే బస్ ఛార్జీల నుంచి పది శాతం రాయితీనీ పొందవచ్చని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News July 8, 2024
మిర్యాలగూడలో రైలు కింద పడి ఆటో డ్రైవర్ సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720414014243-normal-WIFI.webp)
ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై పవన్ కుమార్ రెడ్డి, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం దుర్గా నగర్ కాలనీకి చెందిన నాగేంద్రబాబు(32) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటోలు కొని ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక కుటుంబ పోషణ భారంగా మారి ఆత్మహత్య చేసుకున్నాడు.
News July 8, 2024
నల్గొండ: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720403637280-normal-WIFI.webp)
పురుగుల మందు తాగి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చివ్వెంల మం కుడకుడలో జరిగింది. ఎస్సై కనకరత్నం వివరాలిలా.. మహేశ్ (28)కు ఏడాది క్రితం గాయంవారిగూడేనికి చెందిన నాగలక్ష్మితో వివాహమైంది. గొడవలు రావడంతో 6 నెలల క్రితం విడిపోయారు. మద్యానికి బానిసైన మహేశ్ను తల్లి మందలించడంతో శనివారం రాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు SRPT ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదైంది.
News July 8, 2024
నల్గొండ: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720395041643-normal-WIFI.webp)
నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో విద్యుద్ఘాతంతో ప్రజలు, పశువుల ప్రాణాలు పోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులు, పొలం పనికి వెళ్లిన రైతులు కరెంట్ కాటుకు బలైన ఘటనలో ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కరెంట్ తీగలు కిందికి ఉండడం, కొన్నిచోట్ల కరెంటు తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి జులై వరకు విద్యుద్ఘాతంతో 81 పశువులు మరణించగా, 31 మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు.