News February 26, 2025

నల్లజర్ల: రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు

image

ఏపీలో రేపు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మండలాల వారీగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8:00 నుంచి సాయంత్రం 4:00గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో 2019 మార్చి ఎమ్మెల్సీ ఎన్నికలలో 11 మంది బరిలో దిగగా, ఈసారి 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. గోపాలపురం పరిధిలో ఓటర్లు 6443, గోపాలపురం 1777, దేవరపల్లి 2166, నల్లజర్ల 2500గా ఓటర్లు ఉన్నారు.

Similar News

News February 27, 2025

రాజమండ్రి: నదీజలాలను సంరక్షించండి- కమిషనర్ 

image

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నదీ జలాలను సంరక్షించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు డ్రాయింగ్ పోటీలు, బోట్ రేస్, మ్యూరల్ పెయింటింగ్, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు నోడల్ అధికారిగా ఇంజినీర్ షేక్ మదర్షా అలీని కమిషనర్ నియమించారు.

News February 26, 2025

మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

image

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం అంతా మహా శివరాత్రి పర్వదినాన ఆ గ్రామం అంతా విషాదంతో నిండిపోయింది. నది స్థానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతయి మృత్యువాత పడ్డారు. దీంతో కలెక్టర్ ప్రశాంతి ఉదయం నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయంతో వెలికితీసిన మృతదేహాలను పంచనామా నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News February 26, 2025

ధవళేశ్వరం: స్నేహబంధం.. ఇలా చెదిరిపోయింది

image

వారిద్దరిది ఒకే ఊరు.. ఒకే ప్రాంతం. పక్క పక్కనే ఇళ్లు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్నేహబంధం వారిది. అయితే మృత్యువు రూపంలో ఆ బంధం చెదిరిపోయింది. వివరాలు ఇలా.. ధవళేశ్వరం జాలరి పేటకు చెందిన ప్రాణ స్నేహితులు నాగమళ్ల ముత్యాలు(19), బొడ్డు వెంకటేష్ (16) మంగళవారం బైక్‌పై వెళుతూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో స్పాట్‌లోనే మరణించారు. ఈ దుర్ఘటన చూసిన వారు స్నేహబంధం ఇలా విడిపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు.

error: Content is protected !!