News March 21, 2025

నల్లబెల్లి: తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమారుడు

image

తల్లిదండ్రుల కలను ఓ కుమారుడు నెరవేర్చాడు. నల్లబెల్లి మండల పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలి, పద్మ దంపతుల కుమారుడు బొట్ల కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2023 టీఎస్పీఎస్పీ సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో భద్రాద్రి జోన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వరంగల్ జిల్లా టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు.

Similar News

News March 21, 2025

సివెజ్ ప్లాంట్‌కు స్థల పరిశీలన చేయాలి: మేయర్

image

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేయనున్న సివేజ్ ప్లాంట్‌కు స్థల పరిశీలన చేయాలని అధికారులను మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఆరేపల్లి ప్రాంతంలో గల అగ్రికల్చర్ కేంద్రం, బుల్లికుంట ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలు చేశారు. ఎస్టీపీల ఏర్పాటుకు గుర్తించబడిన జోన్లలో ఇప్పటికి కొన్ని స్థానాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

News March 21, 2025

వరంగల్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

image

వరంగల్ రైల్వే స్టేషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్‌లో భాగంగా రూ.25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.

News March 21, 2025

రాష్ట్రస్థాయి మేళాపై కలెక్టర్ సమన్వయ సన్నాహక సమావేశం

image

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల రాష్ట్ర స్థాయి మేళాపై కలెక్టర్ సత్య శారద వివిధ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సన్నహక సమావేశం నిర్వహించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం రాష్ట్ర స్థాయి మేళ జిల్లాలో మార్చి 25 నుంచి 27 వరకు నిర్వహించినట్లు తెలిపారు. మేళాలో రైతు ఉత్పత్తి దారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖలు ఎలా సమన్వయంతో పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు.

error: Content is protected !!