News May 16, 2024
నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
ఆత్మకూరు మండలం ఇందిశ్వరం గ్రామానికి చెందిన యువకుడు తరుణ్ అదృశ్యమయ్యాడు. బర్రెలు కాచేందుకు బుధవారం నల్లమల అడవిలోకి వెళ్లిన తరుణ్ బర్రెలతో పాటు తప్పిపోయాడు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడి కుటుంబీకులు ఆత్మకూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అడవిలో గాలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో తరుణ్ జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఐ లక్ష్మీనారయణ తెలిపారు.
Similar News
News October 1, 2024
కర్నూలు: సీఎం చంద్రబాబు వరాల జల్లు
పత్తికొండ మం. పుచ్చకాయలమడకు CM చంద్రబాబు వరాలు కురిపించారు. 203 మందికి ఇళ్ల మంజూరు, 48 మందికి కొత్త పెన్షన్లు, 15 రేషన్ కార్డులు, ఐదుగురికి NREGC జాబ్ కార్డులు, 3 రేషన్ కార్డులు మంజూరు. 135 ఇళ్లకు ట్యాప్, ఒక ఇంటికి కరెంటు కనెక్షన్, 105 ఇళ్లకు మరుగుదొడ్లు, 1.7 KM డ్రైనేజీ కాలువ, 10.7 KM CC రోడ్డు, 22 మినీ గోకుళాలు.. వీటన్నింటికీ రూ.2.83 కోట్లు మంజూరు. మద్దికెర, పత్తికొండ, హోసూరుకు రోడ్లనిర్మాణం.
News October 1, 2024
పుచ్చకాయలమడ గ్రామానికి 203 ఇళ్లు: సీఎం చంద్రబాబు
పుచ్చకాయలమడ గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నామని, ముఖ్యంగా ఇళ్ల సమస్య తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పుచ్చకాయలమడ గ్రామంలో 203 మందికి ఇంటి జాగాలు కొని ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం తెలిపారు. 48 మందికి పెన్షన్లు లేవని, వారికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు.
News October 1, 2024
పింఛన్ పంపిణీ@2PM: కర్నూలు 96.43%, నంద్యాల 94.26%
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లాలో 96.43%, నంద్యాల జిల్లాలో 94.26% పంపిణీ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 2,41,843 మందికి గానూ 2,33,204 మందికి, నంద్యాల జిల్లాలో 2,18,225 మందికి గానూ 2,05,691 మందికి పింఛన్ల సొమ్ము అందింది.