News July 30, 2024
నల్లమల ఫారెస్ట్లో 87కు చేరిన పెద్ద పులుల సంఖ్య

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య 87కి చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశంలోనే అతి పెద్దదైన శ్రీశైలం- నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్ట్లో 2014 సంవత్సరంలో పెద్ద పులుల సంఖ్య 48గా ఉండగా.. 2022కు ఆ సంఖ్య 62కు చేరిందన్నారు. ప్రస్తుతం ఆ పెద్ద పులుల సంఖ్య 87. అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణకై 800 మంది చెంచు గిరిజనులు పనిచేస్తున్నారని DFO విఘ్నేశ్ అప్పావ్ తెలిపారు.
Similar News
News February 12, 2026
ప్రకాశం: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.
News February 12, 2026
ప్రకాశం: నిర్మాణాలపై జేసీ సూచనలు

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.
News February 11, 2026
అనుమతుల జారీలో జాప్యం ఉండరాదు: జేసీ

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.


