News March 25, 2024

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

image

1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.  2004లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పరాజయాల అనంతరం బీజేపీలో చేరారు.

Similar News

News September 29, 2024

ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా

image

కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె రహదారిపై ఆదివారం తెళ్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కొరకు కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ ఉదయం 2.30 సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తుండగా వెనక టిప్పర్​కు దారిచ్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందన్నారు.

News September 29, 2024

చక్రాయపేటలో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం

image

కడప జిల్లా చక్రాయపేట మండలంలో నెరుసుపల్లె గ్రామం అప్పిరెడ్డిగారిపల్లెలో శివాజీ అనే యువకుడు, శనివారం ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను కడప రిమ్స్‌కు తరలించినట్లు తెలిసింది. పోలీసులు అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడు శివాజీని అరెస్టు చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

News September 29, 2024

వేంపల్లి: యూట్యూబర్‌పై కేసు నమోదు

image

వేంపల్లెలో ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేతపై కేసు నమోదు చేశారు. తన ఛానెల్లో పని చేస్తున్న యువతిని వేధించిన కేసులో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ రెడ్డి తెలిపారు. ‘అతడి ఛానెల్లో యాంకర్‌గా పనిచేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మానేసినా వేధింపులు అపలేదు. తాను అతడి మాటలు వినలేదని తన ఆఫీసు నుంచి నా సర్టిఫికేట్లు తీసుకెళ్లానని అబద్దపు కేసు పెట్టారు’ అని ఫిర్యాదులో తెలిపింది.