News October 30, 2025
నవంబర్ 1న టూరిజం స్టార్ట్ ఈవెంట్: పీవో

సీతంపేటలోని NTR అడ్వెంచర్ పార్కులో నవంబర్ 1న టూరిజం స్టార్ట్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథం గురువారం తెలిపారు. ఈ ఈవెంట్లో హార్ట్ ఎయిర్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. అదే రోజు జన జాతీయ గౌరవ దివస్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సంధ్యారాణి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.
Similar News
News October 31, 2025
HNK: ‘మా బేబీ మాకు కావాలి’ అంటూ బంధువుల ఆందోళన

హన్మకొండ నయినగర్లోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ సమయంలో శిశువు మృతి చెందడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆపరేషన్ వికటించి బాబు మరణించాడని, అయితే ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని దాచిపెట్టి నాలుగు రోజులుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ‘మా బేబీ మాకు కావాలి’ అంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగగా.. డాక్టర్ తప్పిదం లేదంటూ హాస్పత్రి సిబ్బంది వాదిస్తున్నారు.
News October 31, 2025
KNR: ‘చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం’

KNR జిల్లా చిట్ఫండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదుపు దినోత్సవం నిర్వహించారు. ‘ఈరోజు మనం పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక ఆచార దినం కాదు. ఇది ప్రతి కుటుంబంలో ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్ భద్రత, క్రమశిక్షణకు సంకేతం’ అని అధ్యక్షులు పెంట శ్రీనివాస్ అన్నారు. చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
News October 31, 2025
సైదాపూర్: రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం: పొన్నం

సైదాపూర్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలం ఉన్నారు.


