News July 5, 2025

నవాబ్‌పేట: ఇందిరమ్మ ఇండ్ల అర్హుల వెరిఫికేషన్

image

నవాబ్ పేట మండలం దేపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల వెరిఫికేషను జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గవర్నమెంట్ నిర్ణయించిన కొలతల ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఇసుక సమస్యపై ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, కమిటీ మెంబర్స్‌తో చర్చించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నవీన్, MPDO, MRO, MPO తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

గిల్ మరో సెంచరీ

image

ENGతో రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అదరగొడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్సులో భారీ డబుల్ సెంచరీ చేసిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్సులో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 129 బంతుల్లో 100* రన్స్ చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 303/4గా ఉంది. 483 పరుగుల ఆధిక్యంలో ఉంది.

News July 5, 2025

KMR: SC, STల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: బక్కి వెంకటయ్య

image

గ్రామాల్లో (సివిల్ రైట్స్ డే) కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించి, ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీల భూమి, అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు.

News July 5, 2025

అన్నమయ్య: అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

image

అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి (M) రాయవరం గ్రామంలో కావలిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ఆండీ గోవిందన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శనివారం రాయచోటి రూరల్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మీడియా ఎదుట నిందితుడుని అదనపు ఎస్పీ వెంకటాద్రి తీసుకొచ్చారు. అతని నుంచి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.