News January 22, 2025
నవీపేటలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను ఇద్దరు మైనర్లు (12), (13) శనివారం ఆడుకుందామని పిలిచి లైంగిక దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు.
Similar News
News February 28, 2026
హార్ముజ్ నుంచి రవాణా బంద్

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇతర దేశాల చావుకొచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి రవాణా ఆపేస్తున్నట్లు పలు మేజర్ ముడిచమురు, ఇంధన, నేచురల్ గ్యాస్ కంపెనీలు ప్రకటించినట్లు రాయిటర్స్ తెలిపింది. కొన్నిరోజులు తమ ఓడలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 30% రవాణా ఈ జలసంధి నుంచే అవుతుండగా ప్రస్తుత పరిణామాలతో వాటి ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఈ ప్రభావం INDపైనా పడనుంది. ఇప్పటికే Gold, Silver ధరలు పెరుగుతున్నాయి.
News February 28, 2026
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రావివలసలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 3,280 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ జరిగిందని, రబీ-ఖరీఫ్లలో మరింత సాగు పెంపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్లో భాగంగా ఫుడ్ పార్కులు, ఐటీ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కుల కోసం భూములు గుర్తించినట్లు వివరించారు.
News February 28, 2026
విశాఖ మీదుగా రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్లు

ప్రయాణికుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. విశాఖపట్నం-కొల్లాం (18501) మంగళవారాల్లో, చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్ (17065) మంగళవారాల్లో నడుస్తాయి. ఇవి విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయి. త్వరలోనే వీటి ప్రారంభ తేదీలను వెల్లడిస్తామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ తెలిపారు.


