News August 9, 2025

నవీపేట్: రాఖీ కట్టుకొని వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి (అప్డేట్)

image

నవీపేట(M) <<17352294>>జగ్గారావు ఫారం సమీపంలో<<>> జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు బాసరకు చెందిన సాయిబాబుగా(19) పోలీసులు గుర్తించారు. అతను NZBలో ఉంటున్న తన అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి స్కూటీపై వెళ్తున్న క్రమంలో వేగంగా లారీని ఢీకొట్టాడు. దీంతో సాయిబాబు అక్కడికక్కడే మృతి చెందాడని SI తెలిపారు. స్కూటీ వెనకాల కూర్చున్న అరవింద్ అనే వ్యక్తికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News August 9, 2025

సృష్టి అక్రమాలతో మాకు సంబంధం లేదు: KGH

image

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ అక్రమాల్లో KGHకి ఎటువంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ వాణి స్పష్టం చేశారు. ఈ అక్రమాల్లో KGH, ఆంధ్రా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్ల ప్రమేయం ఉందని మీడియా కథనాల ద్వారా తనకు తెలిసిందన్నారు. దీనిపై ఇంత వరకూ అధికారిక సమాచారం అందలేదని చెప్పారు. ప్రస్థుతం ఈ కేసుపై తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారని, డాక్టర్ల ప్రమేయం ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News August 9, 2025

MBNR: HYDలో తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

image

తమ్ముడి ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచిన అక్క కథ ఇది. MBNRకు చెందిన బాలుడు అప్లాస్టిక్‌ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ HYDలోని KIMSలో అడ్మిట్ అయ్యాడు. మూల కణాల (Stem cells) మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పడంతో తన శరీరం నుంచి దానం చేసిన అక్క తమ్ముడికి పునర్జన్మ‌ను ప్రసాదించింది. ఆస్పత్రిలో ఉన్న తమ్ముడికి నేడు రాఖీ కట్టింది. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష’ అన్న నానుడికి ఈ సోదరి నిదర్శనం.

News August 9, 2025

చీరాలలో గవర్నర్‌ను కలిసిన MLA కొండయ్య

image

చీరాలలో వాడరేవు ఐటీసీ గెస్ట్ హౌస్‌లో శనివారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును ఎమ్మెల్యే కొండయ్య గవర్నర్‌కు వివరించారు.