News April 6, 2024
నవీపేట: కొడుకులు గొడవ పడుతున్నారని తల్లి సూసైడ్

కొడుకులు గొడవ పడుతున్నారని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలం నాగేపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగామణి(55)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయ భూమి విషయంలో కొడుకులిద్దరూ 15 రోజులుగా గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన గంగామణి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొడుకుల మధ్య జరిగిన గొడవతో తల్లి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదైంది.
Similar News
News September 9, 2025
గిరిజనులకు సౌర గిరి జల వికాసం పథకం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

గిరిజనులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన పోడు పట్టాదారులను గుర్తించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 15 మండలాల్లో పోడు భూములకు పట్టాలు అందించినట్లు తెలిపారు.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన ఎంపీ అర్వింద్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో MP అర్వింద్ ధర్మపురి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని ‘F-101 వసుధ’లో రహస్య బ్యాలెట్ విధానంలో ఆయన ఓటేశారు.
News September 9, 2025
NZB: చేపలు పట్టేందుకు వెళ్లి.. చెరువులో పడి మృతి

సిరికొండ మండలం కొండాపూర్ గోప్య తండా పరిధిలోని గంటతాండలో విషాదం నెలకొంది. చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లిన శంకర్ (60) చెరువులో పడి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ చేపల వేటకు వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో వెతకగా, అతని మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.