News September 2, 2025

నవ వధువు ఆత్మహత్య.. వేధింపులే కారణం?

image

నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గంలో జరిగింది. యువతి రూప (19)కు పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన అనిల్‌తో 3 నెలల క్రితం వివాహమైంది. శనివారం ఆమె విషద్రావణం తాగగా కుటుంబ సభ్యులు బళ్లారి విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. భర్త, అత్త వేధింపులతోనే తన కుమార్తె మృతి చెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 2, 2025

ASF జిల్లాలో షీటీం పనితీరు భేష్: ఎస్పీ

image

ఆగస్టు నెలలో షీ టీం బృందాల ద్వారా 3 ఎఫ్ఎఆర్ కేసులు, 83 హాట్ స్పాట్ ప్రదేశాలను గుర్తించినట్లు ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. షీ టీం బృందాలు నెల రోజులలో 25 పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. వివిధ ప్రదేశాలలో ఉండి మహిళలను వేధిస్తున్న వారిని ASF రప్పించి కేసులను నమోదు చేయడంలో ASF షీ టీం బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయన్నారు.

News September 2, 2025

మేరికపూడిలో విషాదం.. తండ్రీకొడుకుల దుర్మరణం

image

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి స్థానికులను కంటతడి పెట్టించింది.

News September 2, 2025

బాపట్ల జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సత్యపాల్

image

బాపట్ల జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సత్యపాల్ నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మెప్మా విభాగంలో మహిళలకు సకాలంలో నిధులు అందించేలా చర్యలు తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకునేలా చూస్తానన్నారు.