News February 5, 2026
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ సుమారు 250 పాయింట్లు తగ్గి 83,571కు చేరగా, నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 25,689 వద్ద ట్రేడ్ అయ్యింది. గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పాటు టెక్ షేర్ల నష్టాలు మార్కెట్పై ప్రభావం చూపాయి. రియల్టీ, ఫార్మా షేర్లు నష్టాల్లో ఉండగా, ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్ షేర్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.
Similar News
News February 14, 2026
40 కంపెనీల సీఈవోలు, 20 దేశాల లీడర్లతో మోదీ భేటీ

ఢిల్లీలో ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న AI Impact Summit కోసం కేంద్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని మోదీ 35-40 టాప్ కంపెనీల సీఈవోలు, 20 దేశాల లీడర్లతో భేటీ కానున్నారు. లిస్టులో ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్, నెట్ఫ్లిక్స్, జూమ్, అమెజాన్ తదితర సంస్థలున్నాయి. దాదాపు $100 బిలియన్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. పీపుల్-ప్లానెట్-ప్రోగ్రెస్ అంశాలపై ఈ సమ్మిట్ జరగనుంది.
News February 14, 2026
పార్టీల మధ్య ఆగని ‘వాలంటైన్స్ డే’ వార్

TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆగడం లేదు. మధ్యాహ్నం ఒకరిపై ఒకరు చేసుకున్న ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. ‘BRS loves modi more than TG’ అని కాంగ్రెస్ ట్వీట్ చేయగా ‘ఆయనకి ఇద్దరు’ పోస్టర్తో బీఆర్ఎస్, కాంగ్రెస్కు BJP కౌంటర్ ఇచ్చింది. ఇక ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ పోస్టర్తో బీజేపీ, కాంగ్రెస్, MIMపై BRS సెటైర్లు వేసింది.
News February 14, 2026
బిల్ గేట్స్ను మూడుసార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: సీఎం

AP: మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనను మూడుసార్లు APకి తీసుకొచ్చిన ఘనత తనదేనని ఎమ్మెల్యేలతో భేటీలో చెప్పారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్, ఇప్పుడు సంజీవని పథకం కోసం పిలిపిస్తున్నామన్నారు. కాగా ఈ స్కీమ్ ద్వారా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది.


