News February 6, 2026
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో 25,535 వద్ద, సెన్సెక్స్ 300 పాయింట్లు తగ్గి 83,000 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు RBI మానిటరీ పాలసీ ప్రకటన ఉండటంతో పెట్టుబడిదారులు దానికోసం వేచిచూస్తున్నారు. మరోవైపు అమెరికా సహా పలు గ్లోబల్ మార్కెట్లు సైతం నష్టాల్లో ఉండటం దేశీయంగా ప్రభావం చూపిస్తోంది. దీంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Similar News
News February 16, 2026
జీడిమామిడిలో అంతర పంటలు.. లాభాలు

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.
News February 16, 2026
ఉపవాసం విరమించే ముందు..

ఉపవాసాన్ని విరమించే ముందు ఇంట్లో శివునికి నైవేద్యం సమర్పించాలి. అలాగే దీపారాధన కూడా చేయాలి. వీలైతే పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అన్నదానం తర్వాత ఉపవాసం విరమిస్తే వచ్చే పుణ్యం అనంతం. పారణ చేసేటప్పుడు ‘ఓం నమః శివాయ’ మంత్రం జపించాలని పండితులు సూచిస్తున్నారు. భగవంతునిపై మనసు లగ్నం చేసిన తర్వాత పాటించే ఈ పరిహారాలు అనంత పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే విరమణ తర్వాత కూడా ప్రశాంతంగా, భక్తితో ఉండాలి.
News February 16, 2026
ఇంటర్వ్యూతో CDRIలో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (C<


