News January 31, 2025

నసురుల్లాబాద్: సాయిబాబా ఆలయంలో అమెరికా బృందం

image

నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలోని సాయిబాబా మందిరాన్ని శుక్రవారం అమెరికా బృందం సభ్యులు సందర్శించారు. ఆలయంలో తిరిగి పరిశీలించారు. ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలను పూజారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి, విట్టల్ రెడ్డి, DSR రాజు, అనుపాల్ రెడ్డి, విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

HYD: గోల్డెన్ అవర్ మిస్ అయితే గండమే!

image

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ హవర్ అని అంటాం. ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రుడికి వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90శాతానికిపైగా ఉంటుందని HYD డా.రవి ప్రకాష్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ జరిగిన సమయంలో తొలి 4 గంటలలోపు గోల్డెన్ అవర్గా భావిస్తారు. అయితే తొలి గంటలో వైద్యం 30% మందికి అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. SAVE THE LIFE

News November 16, 2025

HYD: ORR, హైవేలపైనే అధిక యాక్సిడెంట్స్!

image

గ్రేటర్ HYD అవుటర్ రింగ్ రోడ్డు (ORR), దాని చుట్టూ ఉన్న జాతీయ రహదారులపై ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 52% ప్రమాద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అధికవేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి కారణాలు ప్రధానంగా గుర్తించారు.

News November 16, 2025

రేపు నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

నూజివీడు పట్టణ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ..రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. ప్రతి అర్జీ ఆన్లైన్ చేయడం, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.