News December 1, 2025
నస్పూర్: ‘ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.
Similar News
News April 5, 2026
జగన్ అబద్ధం ఆడుతున్నారు: TDP

AP: రాజధాని అమరావతిలో చదరపు అడుగుకు రూ.12,000 ఖర్చవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నారని TDP ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అలా అనుకున్నా విలాసాలకు ఆయన కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ చ.అడుగుకి రూ.35,714 అయ్యిందని విమర్శించింది. దీనికి జగన్ ఏమని జవాబు చెబుతారని ప్రశ్నించింది. ఇక అబద్ధంతో బతుకుతూ, విద్వేషం చిమ్ముతూ అమరావతి విషయంలో ఒక్కడినే ఇంకో వైపు అనుకోవటం మానసిక స్థితిని తెలియజేస్తుందని ఎద్దేవా చేసింది.
News April 5, 2026
NZB: నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలి: కవిత

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత ఆదివారం X వేదికగా డిమాండ్ చేశారు. వడగళ్ల వాన బోధన్ నియోజకవర్గ రైతులకు కన్నీటిని మిగిల్చిందని సాలూర, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు.
News April 5, 2026
రాజంపేట: జాతర ఎప్పుడో తెలియదు.. జెయింట్ వీల్ వచ్చేసింది

రాజంపేటలో ప్రసిద్ధి చెందిన బలిజపల్లి గంగమ్మ జాతర ఎప్పుడు అనేది ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ఈరోజు, ఆరోజు అంటూ పుకార్లు షికార్లు చేస్తుండడంతో భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని కొన్ని కుటుంబాలకు మాత్రమే జాతర నిర్వహణ బాధ్యతఉంది. అందువల్ల ప్రతి ఏడాది ఇదే తంతు నడుస్తోంది. జాతర ఉంటుందని నమ్మి ఈ ఆదివారం వ్యాపారులు జెయింట్ వీల్ తీసుకొచ్చారు.


