News December 1, 2025

నస్పూర్: ‘ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.

Similar News

News March 29, 2026

నల్గొండ: మొదలైన పునర్విభజన సెగ..!

image

2026 జనాభా లెక్కల ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగనుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. మునుగోడు విభజన, సూర్యాపేట కేంద్రంగా కొత్త పార్లమెంటు స్థానం ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియలో దక్షిణ భారత్‌కు అన్యాయం జరగకుండా చూడాలని, పారదర్శకమైన ఓటర్ల జాబితాతోనే డెలిమిటేషన్ చేపట్టాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

News March 29, 2026

30, 31 ఏపీ గవర్నర్ తిరుమల – తిరుపతి పర్యటన

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మార్చి 30, 31 తేదీలలో తిరుమల – తిరుపతి పర్యటనకు రానున్నారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై వెంకటేశ్వర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News March 29, 2026

NLG: బైక్ షోరూంకు రూ.1.75 లక్షల భారీ జరిమానా !

image

కొత్త బైక్ సరిగ్గా నడవకపోవడంతో బాధితుడికి న్యాయం చేస్తూ నల్గొండ వినియోగదారుల కమిషన్ కీలక తీర్పునిచ్చింది. చౌటుప్పల్‌కు చెందిన మల్లేష్ 2023లో కొన్న హీరో గ్లామర్ బైక్ మొరాయించడంతో షోరూం నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో ఆయన కమిషన్‌ను ఆశ్రయించగా.. బైక్ ఖరీదు రూ.1.35 లక్షలు, జరిమానా రూ.30 వేలు, కోర్టు ఖర్చులు రూ.10 వేలు కలిపి మొత్తం రూ.1.75 లక్షలు చెల్లించాలని హైటెక్ మోటార్స్‌ను కోర్టు ఆదేశించింది.