News October 4, 2024

నాంపల్లి: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్

image

ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.

Similar News

News January 26, 2026

రంగారెడ్డి: కలెక్టరేట్‌లో ఏర్పాట్లు అధ్వానం

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. కానీ ఏర్పాట్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయని వచ్చిన వారు మండిపడుతన్నారు. కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో పసిపిల్లలను ఎత్తుకుని ఎండలో నిలబడ్డారు.

News January 25, 2026

HYD: సాగర తీర విగ్రహాల వెనుక దాగిన చరిత్ర

image

HYD- SECను కలిపే హుస్సేన్‌సాగర్‌కు వెళ్తే వరుసగా కొలువైన 34 మంది మహానీయుల విగ్రహాలపైకి చూపు మళ్లక మానదు. ముందు తరాల వారికి దీని గురించి తెలిసినా.. నేటి తరానికి అదొక ప్రశ్నే. ఈ విగ్రహాలతో వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరు ఎవరు? అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. ఈ మహనీయుల వీరగాథ, చరిత్ర చెప్పేందుకు Way2News రోజుక్కొక్కరి స్టోరిని సంక్షిప్తంగా అందిస్తుంది.

News January 25, 2026

రంగారెడ్డి: ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కార్యాలయాలు, పోలింగ్ బూత్ స్థాయుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు, యువత పెద్దఎత్తున పాల్గొనాలని కలెక్టర్ కోరారు.