News September 3, 2025
నాంపల్లి: ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గౌరిపుత్రుడి నిమజ్జనం

బజార్ఘాట్లోని బంగారు ముత్యాలమ్మ ఆలయం ముందు ఏర్పాటు చేసిన 18 అడుగుల గణేశుడు తళుక్కున మెరిసిపోతున్నాడు. ఈ లంబోదరుడిని ప్రత్యేకంగా స్టోన్స్(వజ్రాల)తో అలంకరించారు. 50 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న ఈ గణనాథుడిని ఈసారి మొయినాబాద్లో తయారు చేయించారు. చవితి రోజున ప్రారంభమైన అన్నదానం శనివారం వరకు సాగనుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అదేరోజు ఈ గౌరిపుత్రుడిని నిమజ్జనం చేయనున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు.
Similar News
News September 3, 2025
సికింద్రాబాద్: BIS అధికారుల తనిఖీలు

సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్లో ఉన్న ఓ గోదాంలో ఈరోజు బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో దాదాపు రూ.8 లక్షల పైగా విలువైన 225 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించినట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్ లేని, నకిలీ ఐఎస్ఐ ముద్ర ఉన్న ఉత్పత్తులు జప్తు చేసినట్లు వెల్లడించారు. వీటిలో మిక్సర్లు, ప్రెజర్ కుక్కర్లు, ఫ్యాన్లు తదితర వస్తువులను గుర్తించారు. కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
News September 3, 2025
FLASH: HYD: నాంపల్లి కోర్టుకు నాగార్జున, నాగ చైతన్య

HYD నాంపల్లి మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు, హీరో అక్కినేని నాగచైతన్య ఈరోజు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన విచారణలో భాగంగా ఇద్దరూ కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ విచారణపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
News September 3, 2025
HYD: మేడారం మహా జాతర ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్పై మంత్రుల సమీక్ష

సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలతో మేడారం దేవాలయ ప్రాంగణం నూతన డిజైన్ను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు HYDలో పరిశీలించారు. డిజైన్లో అవసరమైన మార్పులపై చర్చించి, తగిన సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, పూజారుల అభిప్రాయం మేరకు ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.