News February 11, 2025
నాంపల్లి: జబల్పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739273314430_718-normal-WIFI.webp)
జబల్పూర్లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.
Similar News
News February 11, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739289303156_50308805-normal-WIFI.webp)
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.
News February 11, 2025
హనుమకొండ: చికెన్ సెంటర్ యజమానికి రూ.30 వేల పెనాల్టీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739286521645_51243309-normal-WIFI.webp)
అపరిశుభ్ర ప్రదేశంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న యజమానికి రూ.30 వేలు పెనాల్టీ విధించినట్లు బల్దియా ముఖ్యఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి తెలిపారు. న్యూశాయంపేటలోని వినాయక చికెన్ సప్లయర్స్ యాజమాన్యం సరియైన హైజీన్ పద్ధతులు పాటించడం లేదని ఆయన అన్నారు. దుకాణ ఆవరణ అపరిశుభ్రంతో పాటు చికెన్ వ్యర్థాలను డ్రైనేజీలో వదిలినందకు పెనాల్టీ విధించామన్నారు.
News February 11, 2025
‘మద్యం’పై మాట తప్పిన ప్రభుత్వాలు.. మీరేమంటారు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739287578602_695-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపుపై మందుబాబులు ఫైరవుతున్నారు. APలో మద్యం ధరలు పెంచబోమని, తగ్గిస్తామని CM CBN, కూటమి నేతలు చెప్పి ఇప్పుడేమో బాటిల్పై రూ.10 పెంచారని మండిపడుతున్నారు. TGలో బీర్ల కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించబోమని, రేట్లు పెంచేది లేదని JANలో CM రేవంత్ ప్రకటించారు. నెల తిరక్కుండానే 15% పెంచి మాట తప్పారని దుయ్యబడుతున్నారు. ఈ అంశంపై మీ కామెంట్ ఏంటి?