News February 11, 2025

నాంపల్లి: జబల్‌పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

image

జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.

Similar News

News January 1, 2026

‘రాష్ట్రంలోనే జగిత్యాలను ప్రథమ స్థానంలో నిలుపుదాం’

image

విద్యా రంగంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదామని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ JGTL జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సం.డైరీ, క్యాలెండర్‌ను గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, DEO రాములు ఆవిష్కరించారు. ఇందులో TRS రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.

News January 1, 2026

వరంగల్: న్యూ ఇయర్ వేళ ప్రభుత్వ ఆసుపత్రిలో కవలల జననం!

image

న్యూ ఇయర్ వేళ జన్మించిన కవలలు ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. 2026 నూతన సంవత్సరం వేళ వరంగల్ CKM ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గురువారం ఉదయం వరంగల్ గిర్మాజిపేటకు చెందిన ఓ మహిళ ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. వీరితో పాటు ఆసుపత్రిలో మరో 10 మంది మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు జన్మించారు. జీవిత కాలం గుర్తుండేలా నూతన సంవత్సరంలో పుట్టిన పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

News January 1, 2026

సంగారెడ్డి: ‘ఇంటర్ పరీక్షలకు సిద్ధం చేయాలి’

image

జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంటర్ పరీక్షలకు ఇప్పటి నుంచి సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందరామ్ గురువారం తెలిపారు. సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పారు. మంచి ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.