News October 3, 2025

నాంపల్లి: నేడు దత్తన్న అలయ్.. బలయ్

image

నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్.. బలయ్ కార్యక్రమం భారీ ఎత్తున్న జరిగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎంలు, కేంద్ర మంత్రులు, సినీ రంగ ప్రముఖులు, వివిధ పార్టీల కీలక నేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి రావాలని అందరికీ ఆహ్వానం అందించారు.

Similar News

News October 3, 2025

HYD: పెద్దనాన్న వేధింపుతో విద్యార్థిని సూసైడ్

image

సొంత పెద్దన్నాన అత్యాచార వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాలిలా.. కొంపల్లిలోని పోచమ్మ గడ్డలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరకగా పెద్దనాన్నే కాలయముడయ్యాడని తేలింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News October 3, 2025

నేడు CM చేతుల మీదుగా ఫలక్‌నుమా ROB ప్రారంభం

image

పాతబస్తీ వాసులకు శుభవార్త. నేడు ఫలక్‌నుమా ROB CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభంకానుంది. రూ.52.03 కోట్లతో 360.0 మీటర్ల పొడవులో GHMC, SCR సంయుక్తంగా దీనిని నిర్మించింది. బర్కస్ నుంచి చార్మినార్ రూట్‌తో పాటు ఫలక్‌నుమాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ROB ఉపయోగపడుతుంది. ఉదయం 9:15 నిమిషాలకు CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్‌ఛార్జీ మంత్రులు, MP అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రారంభించనున్నారు.

News October 2, 2025

హైదరాబాద్: మూసీ అందాలు కనువిందు చేసేలా!

image

మూసీ నది అందాలు కనువిందు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నగరంలో మూసీ నది దాదాపు 55 కిలోమీటర్ల మేర విస్తరించింది. ముందుగా 20.5 కిలోమీటర్లను సుందీకరించనున్నారు. ఇందుకు దాదాపు రూ.5,641 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.5KM), ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ (11 KM) వరకు సుందరీకరించనున్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిసింది.