News November 27, 2025

నాగర్‌కర్నూల్‌లో తొలిరోజు 121 నామినేషన్లు

image

నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని ఆరు మండలాల్లోని 151 గ్రామ పంచాయతీలకు ఎన్నికల అధికారులు గురువారం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. మొదటిరోజు 121 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నామినేషన్లకు మరో రెండు రోజులే అవకాశం ఉండడంతో, రేపు, ఎల్లుండి పెద్ద మొత్తంలో నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Similar News

News December 1, 2025

పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

image

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.

News December 1, 2025

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ల వివక్షత చూపరాదు: అల్లూరి కలెక్టర్

image

ఎయిడ్స్ వ్యాధి గ్రామస్థుల పట్ల తోటి వారు వివక్షత చూపరాదని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరంలో ఎయిడ్స్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో మనోదైర్యం కల్పించాలని సూచించారు. వారికి అండగా నిలవాలన్నారు. వ్యాధిగ్రస్తులను కలసి భోజనం చేసినా, మాట్లాడినా వ్యాధి సంక్రమించదన్నారు.

News December 1, 2025

హనుమాన్ చాలీసా భావం – 26

image

సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై ||
మనసు, మాట, కర్మ.. ఈ త్రికరణ శుద్ధితో హనుమంతుడిపై భక్తి ఉంచితే ఆయన మనల్ని భయాల నుంచి కాపాడతాడు. కష్టాల నుంచి విముక్తులను చేస్తాడు. మన ఆలోచనలో, ఆచరణలో, మాటలో భక్తి భావం ఉన్నవారికి ఆంజనేయుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలా లభించినవారు కష్టాలను దాటి, జీవితంలో అపార విజయాన్ని అందుకుంటారు. <<-se>>#HANMANCHALISA<<>>