News April 1, 2025

నాగర్‌కర్నూల్: ‘అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’

image

ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఊరుకొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో పవిత్రమైన దేవాలయం వద్ద ఇలాంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 2, 2025

జపాన్‌కు పొంచి ఉన్న ముప్పు.. డేంజర్‌లో 3లక్షల మంది ప్రాణాలు!

image

జపాన్‌లో త్వరలోనే అతిపెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు తీసుకుంటుందని, జపనీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విపత్తు భారీ విధ్వంసానికి కారణమవుతుందని, సునామీలు సంభవించి ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బందిని అలర్ట్‌ చేశారు. ఇటీవలే మయన్మార్‌లో వచ్చిన భూకంపానికి వేల మంది చనిపోయారు.

News April 2, 2025

అల్లు అర్జున్ పేరులో మార్పు?

image

‘పుష్ప-2’ సినిమాతో భారీ విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన వివాదాస్పద ఘటనలతో పాటు కెరీర్‌లో మరిన్ని విజయాల కోసం ఆయన తన పేరులో సంఖ్యాపరమైన మార్పులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. తన పేరు స్పెల్లింగ్‌లో అదనంగా U, Nలు జోడించాలని యోచిస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News April 2, 2025

మావోయిస్టుల సంచలన ప్రకటన

image

కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యాకాండను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్పారు. ఇటీవల కేంద్రం చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.

error: Content is protected !!