News April 1, 2025
నాగర్కర్నూల్: కల్వకుర్తిలో విషాదం

కల్వకుర్తి పట్టణానికి చెందిన వీరెడ్డి మధుసూదన్ రెడ్డి కుమారుడు వీరెడ్డి ఆనంద రెడ్డి (32) బ్రెయిన్ స్ట్రోక్తో మంగళవారం ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉగాది పండుగ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ఆయన అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన HYDలోని ఆస్పత్రికి తరలించారు. 2 రోజులపాటు చికిత్స పొందిన ఆయన ఈరోజు ఉదయం మృతిచెందాడు. పెళ్లి వార్షికోత్సవం రోజే మరణించడం మరింత బాధాకరం.
Similar News
News September 17, 2025
ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.
News September 17, 2025
20న తిరుపతిలో జాబ్ మేళా

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో 20వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఫార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
News September 17, 2025
హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.