News August 20, 2025

నాగర్‌కర్నూల్‌: ‘గణేష్ మండపాలకు దరఖాస్తు చేసుకోవాలి’

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. policeportal.tspolice.gov.in పోర్టల్‌లో కమిటీ, మండపం వివరాలు, ఫోన్‌ నంబరు వంటి సమాచారం తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు ఈ జాగ్రత్తలు అవశ్యమని పేర్కొన్నారు.

Similar News

News April 5, 2026

చిత్తూరు: రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు యాదమరిలో ఏఈ కార్యాలయంలో యాదమరి, బంగారుపాళ్యం మండలాలకు సంబంధించిన సమస్యలు తెలుపవచ్చన్నారు. అలాగే చిత్తూరు గాంధీ రోడ్డులోని ఈఈ కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటలకు చిత్తూరు, పూతలపట్టు మండల వినియోగదారులు సమస్యలను ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 5, 2026

నేడు ఒంటిమిట్ట రామయ్యకు పుష్పయాగం

image

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో నేడు(ఆదివారం) రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.

News April 5, 2026

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు

image

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రిందట ప్రభుత్వం ఆయన్ను విజయనగరం నుంచి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీడీవోగా, ఇతర శాఖలలో పనిచేసిన అనుభవం ఉందని వెంకట్రామన్ పేర్కొన్నారు. జడ్పీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.