News March 23, 2025
నాగర్కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్.!

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం నుంచి గురువారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన నివేదికలో వాతావరణ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. సోమవారం నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశము ఉందని నివేదికలో పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
జపాన్లో ఎన్టీఆర్ బిజీ బిజీ!

జపాన్లో ‘దేవర’ సినిమా విడుదల నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. నిన్న స్పెషల్ స్క్రీనింగ్లో పాల్గొన్న ‘దేవర’.. అక్కడున్న అభిమానులతో స్టెప్పులేశారు. రెండో రోజూ ఆయన షినాగావా అక్వేరియంను సందర్శించారు. అక్కడున్న షార్క్లతో ఫొటోలు దిగుతూ కనిపించారు. క్లాసీ లుక్లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలు వైరలవుతున్నాయి.
News March 25, 2025
విశాఖ: ఫ్రీ పార్కింగ్.. ఏప్రిల్ 1 నుంచి అమలు

విశాఖలోని వాణిజ్య సముదాయలు, మాల్స్, మల్టీప్లెక్సుల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజును వసూలు చేయరాదని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి. వాణిజ్య సముదయాలలో వస్తువులు కొనుగోలు చేసి బిల్లులు చూపిస్తే 30 నిముషాలు, మల్టిఫ్లెక్స్లో సినిమా టికెట్ చూపిస్తే గంటసేపు పార్కింగ్ చేసుకోవచ్చుని ఉత్తర్వులలో పేర్కోంది.
News March 25, 2025
సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్ను పరిశీలించిన వరంగల్ కలెక్టర్

వరంగల్ పట్టణంలోని రంగశాయిపేట యూపీహెచ్సీ ప్రాంగణంలోని కేంద్ర ఔషధ గిడ్డంగి (సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్) ను కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఔషధాల స్టాక్ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైన సూపర్వైజర్తో పాటు విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.