News December 15, 2025
నాగర్కర్నూల్ జిల్లాలో తగ్గుతున్న చలి తీవ్రత

నాగర్కర్నూల్ జిల్లాలో గత నాలుగైదురోజుల నుంచి చలి తీవ్రత తగ్గుతోంది. గడిచిన 24 గంటలో కల్వకుర్తి మండలం తోటపల్లిలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ 11.7°C, యంగంపల్లి 12.4°C, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 12.5°C, బొల్లంపల్లి 12.8°C, తిమ్మాజిపేట 12.9°C, పెద్ద ముద్దునూరు 13.0°C, వెల్దండలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 17, 2025
KPHB సాయినగర్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KPHB PS పరిధిలోనీ సాయినగర్లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 17, 2025
శ్రీరాంపూర్: సింగరేణి ఇన్చార్జి సీఅండ్ఎండీగా కృష్ణ భాస్కర్

సింగరేణి సంస్థ ఇన్చార్జి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఅండ్ఎండీ)గా కృష్ణ భాస్కర్ నియమితులైనట్లు సమాచారం. 2012 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కృష్ణ భాస్కర్ ప్రస్తుతం ట్రాన్స్కో సీఅండ్ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగరేణి సీఅండ్ఎండీగా ఆయనను ప్రభుత్వం నియమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.
News December 17, 2025
సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ బాధ్యతల స్వీకరణ

సింగరేణి సంస్థ సీఎండీగా దేవరకొండ కృష్ణ భాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడేళ్ల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణ భాస్కర్ మంగళవారం సింగరేణి భవన్లో బలరామ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు నూతన సీఎండీకి స్వాగతం పలికారు.


