News April 8, 2024
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం.. యువతి హత్య !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712560153573-normal-WIFI.webp)
యువకుడు ఓ యువతిని హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానికుల వివరాలు.. కల్వకుంట తండాకు చెందిన చిట్టెమ్మ(28) భర్తతో విడాకులు తీసుకుంది. కొంతకాలంగా బిజినేపల్లికి చెందిన శివతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నిన్న రాత్రి శివ ఫోన్ చేయడంతో వట్టెం శివారులోని పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణలో చిట్టెమ్మ చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పత్తి చేనులో కప్పి నేడు పోలీసులకు శివ లొంగిపోయాడు.
Similar News
News December 23, 2024
BRS ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు: ఎంపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734879830446_52033411-normal-WIFI.webp)
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక్క ఏడాది అయిందనే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు మర్చిపోయారు. ఇంకా తామే అధికారంలో ఉన్న ఊహల్లో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గతంలో వారు లక్ష రుణమాఫీ అని నాలుగు, ఐదు కంతుల్లో వేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని విమర్శించారు.
News December 22, 2024
NGKL: శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734843639722_774-normal-WIFI.webp)
NGKL జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<14947368>>స్పాట్డెడ్<<>> అయ్యారు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్పై శ్రీశైలం వెళ్తున్నారు. మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. అరవింద్ స్పాట్లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.
News December 21, 2024
కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు: సీఎం రేవంత్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734771913026_52033411-normal-WIFI.webp)
బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.