News January 23, 2026
నాగర్కర్నూల్ జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

నాగర్కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 992 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ నెలలో అదనంగా 3,026 టన్నుల సరఫరా రానుందని పేర్కొన్నారు. ఇప్పటికే 22,175 టన్నుల యూరియా పంపిణీ జరిగిందని, నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 1, 2026
పాక్ ఆరోపణలు అబద్ధం: భారత్ ఘాటు జవాబు

బలూచిస్థాన్ <<19017774>>దాడుల్లో<<>> భారత్ హస్తం ఉందన్న పాక్ ఆరోపణలను ఇండియా కొట్టిపారేసింది. ఇవన్నీ ఆధారాల్లేని తప్పుడు వాదనలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాక్ ఇలాంటి గిల్లీకజ్జాలు పెట్టుకుంటోందని విమర్శించింది. దాడుల్లో 15 మంది సైనికులు, 100కు పైగా మిలిటెంట్లు మరణించినట్లు సమాచారం. నిందలు ఆపి మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని భారత్ సూచించింది.
News February 1, 2026
NZB: రాష్ట్ర స్థాయి సీనియర్ క్రికెట్ టోర్నీకి జిల్లా మహిళ జట్టు

తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళ క్రికెట్ టోర్నీలో పాల్గొనే నిజామాబాద్ జిల్లా జట్టు ఖరారైనట్లు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. HCA ఆధ్వర్యంలో వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ ఉమెన్ క్రికెట్ టోర్నీకి జిల్లా నుంచి 19 మంది క్రీడాకారిణులను ఎంపిక చేశారు. ఈనెల 2 నుంచి 7 వరకు వరంగల్లో జరిగే టోర్నీలో పాల్గొంటారు. అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్ రెడ్డి వారిని అభినందిచారు.
News February 1, 2026
కేసీఆర్ను సిట్ అడిగిన ప్రశ్నలివే?

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRను సిట్ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులను మీరే ఆదేశించారా? మీ పార్టీ MLAలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది? ఎప్పటి నుంచి ప్రైవేటు వ్యక్తుల ఫోన్ల ట్యాప్ జరిగింది? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని మీరే కోరారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. వీటికి KCR తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.


