News December 17, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

image

జిల్లాలోని 7 మండలాల్లో గల 158 పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. అచ్చంపేట, లింగాల, అమ్రాబాద్‌ తదితర మండలాల్లో అధికారులు తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం సర్పంచ్ ఫలితాలను వెల్లడించనున్నారు. మేజర్ పంచాయతీల ఫలితాలు వెలువడటానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని, అనంతరం ఉపసర్పంచుల ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News March 3, 2026

పెద్దపల్లి: అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు: SE

image

పెద్దపల్లి సర్కిల్‌లో విద్యుత్ లేని 69 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని SE వి.గంగాధర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కేంద్రాలను గుర్తించి, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలతో పాటు విద్యుత్ సేవలను వేగంగా అందిస్తున్నామన్నారు.

News March 3, 2026

సిరిసిల్ల: జిల్లా ఎస్పీని కలిసిన వేములవాడ డీఎస్పీ

image

వేములవాడ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు జిల్లా ఎస్పీ మహేష్ బి గితేను మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయనకు సూచించారు.

News March 3, 2026

WGL: మన పెద్ద పులి కనిపించకుండా పోయింది..!

image

పాకాల అడవుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పెద్దపులి 2009లో కనుమరుగైంది. ఆరోజుల్లో పాకాల జనావాసాల మధ్యన రోడ్లపైకి వస్తే జనం భయభ్రాంతులకు గురయ్యేవారు. చివరిగా ఆ పులి, 2009లో కనిపించిందని, అది వేటకు గురై ఉంటుందని వరంగల్ విశ్రాంత అటవీ శాఖ అధికారి తెలిపారు. జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్న పులుల ఆనవాళ్లు మహారాష్ట్ర తడోబా, ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి అరణ్యాలకు చెందినవన్నారు.
# నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం