News April 23, 2025
నాగర్కర్నూల్: దరఖాస్తుల ఆహ్వానం

నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో మండల, జిల్లా స్థాయి రీసోర్స్పర్సన్లుగా పని చేసేందుకు ఆసక్తి గల ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. గురువారంలోగా నాగర్కర్నూల్లోని డీఈవో ఆఫీస్లో దరఖాస్తులు అందించాలని సూచించారు.
Similar News
News January 8, 2026
బాల్యం ‘బట్టీ’ పాలు కావొద్దు: అడిషనల్ ఎస్పీ

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.
News January 8, 2026
భద్రాద్రి: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు

టెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా గురువారం భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా ముగిసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో సెషన్ 1కు మొత్తం 100 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 87 మంది హాజరై 13 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అదే విధంగా సెషన్2కు 100 మంది అభ్యర్థులు కేటాయించబడగా, 56 మంది హాజరై 44 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు.
News January 8, 2026
ఏలూరు: ఎంపీ దృష్టికి కోకో రైతుల సమస్యలు

ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో గురువారం కోకో రైతులు ఎంపీ మహేశ్ కుమార్ని కలిసి సమస్యలు విన్నవించారు. కంపెనీలు సిండికేట్గా మారి, ధరలు తగ్గించి రైతులను మోసగిస్తున్నాయన్నారు. మన దేశ అవసరాలకు కావాల్సిన కోకో గింజలు 20% మాత్రమే దేశంలో ఉత్పత్తి జరుగుతుందని, 80% కోకో గింజలు, కోకో ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటున్నామని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.


