News April 4, 2025

నాగర్‌కర్నూల్: పెద్దపులి దాడి.. యజమానులకు నష్టపరిహారం

image

NGKL జిల్లా అచ్చంపేట ప్రాంతంలో రెండు నెలల క్రితం పెద్దపులి దాడిలో మృతిచెందిన పశువుల యజమానులకు అటవీ శాఖ నష్టపరిహారం అందజేసింది. బక్క లింగాయపల్లి, దండాలం గ్రామాలకు చెందిన హరి, వెంకట్రామ్, రాకేశ్‌కు వరుసగా రూ.15,000, రూ.15,000, రూ.12,000 చొప్పున చెక్కులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబూర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేంద్ర, అధికారులు బాలరాజు, జ్యోతి, రజిత తదితరులు ఉన్నారు.

Similar News

News November 7, 2025

వానొస్తే.. ట్రైసిటీ హడల్‌..!

image

ఉమ్మడి WGLలో ఇటీవల సంభవించిన వరదలు ట్రైసిటీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం అంటేనే నాళాల పక్కన ఉన్న కాలనీల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏ సమయానికి వరదలు వచ్చి ఇళ్లు మునుగుతాయోనని, ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. WGLలో CM పర్యటించినా, ముంపునకు శాశ్వత పరిష్కారం దొరకలేదని, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మీ కాలనీకి వరద వచ్చిందా?

News November 7, 2025

నిడదవోలులో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

నిడదవోలు ఓవర్‌ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. త్రిబుల్ రైడ్ చేస్తూ వస్తున్న ముగ్గురు యువకులు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News November 7, 2025

బాలీవుడ్ నటి సులక్షణ కన్నుమూత

image

ప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ సులక్షణా పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు లలిత్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఈమె జన్మించారు. తొలుత సింగర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘సంకల్ప్’ మూవీలో పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఆ తర్వాత సంజీవ్ కుమార్, రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్నసిన్హా వంటి ప్రముఖుల సరసన నటించారు.