News April 5, 2025
నాగర్కర్నూల్: ‘మా జీతాలు మాకివ్వండి’

పెండింగ్లో ఉన్న కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణమ్మ, రాధ, బాలమణి, రేణుక, సంతోష, లక్ష్మి, శ్రీదేవి ఉన్నారు.
Similar News
News September 19, 2025
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్: పరవాడ సీఐ

పరవాడ మండలం జలారిపేటలో ఈనెల 17న భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటనలో భర్త ఒలిశెట్టి కొండను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. నిందితుడు పరవాడ మండలం వెన్నెలపాలెంలో సంచరిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అనంతరం అనకాపల్లి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
News September 19, 2025
VJA: దుర్గగుడి ఛైర్మన్ నియామకంపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్గా బాలకృష్ణ అభిమాని బొర్రా గాంధీని నియమించడంపై స్థానిక TDP నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. YCP పాలనలో కేసులను ఎదుర్కొని, పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు పదవి దక్కుతుందని ఆశించారు. అయితే, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా లేని గాంధీకి బాలకృష్ణ సిఫార్సుతోనే పదవి లభించిందని జిల్లా TDP నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
News September 19, 2025
HYD: మ్యాన్హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

భారీ వర్షాల నేపథ్యంలో హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి PRT బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి MD అశోక్రెడ్డి ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో ఉ.6 నుంచి ఉ.9 గం. వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్హోల్ మూతలు తెరవొద్దని, ఒకవేళ తెరిచి ఉంటే HMWSSB 155313, హైడ్రా 9000113667 నంబర్లకు కాల్ చేయాలన్నారు.