News April 16, 2025

నాగర్‌కర్నూల్: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 19, 2025

ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

image

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.

News April 19, 2025

SUMMER హాలీడేస్.. ఆసిఫాబాద్‌ను చుట్టేద్దాం చలో

image

వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఎక్కడికి వెళ్లాలో ఆలోచిస్తున్నారా? ప్రకృతి రమణీయత చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు మన జిల్లాలోనే ఉన్నాయి. ప్రాణహిత నది, పాలరాపులగుట్ట, సిద్ధప్ప గుహలు, సిర్పూర్ కోట, వట్టి వాగు, ఆడ ప్రాజెక్టు, జోడేఘాట్ కొమరం భీమ్ స్మృతి వనం, కంకాలమ్మ గుట్ట, శివ మల్లన్న దేవస్థానం, గంగాపూర్ బాలాజీ ఆలయాలున్నాయి. అందమైన ప్రదేశాలు దర్శించి మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకుందాం..!

News April 19, 2025

SUMMER HOLIDAYS.. మంచిర్యాల చుట్టేద్దాం చలో

image

వేసవి సెలవులు షురూ కావడంతో ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా? ప్రకృతి రమణీయత, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. గాంధారి ఖిల్లా, గూడెం శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం, గోదావరి నది, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ అందమైన ప్రదేశాలను సందర్శించి మరపురాని జ్ఞాపకాలు సొంతం చేసుకోండి!

error: Content is protected !!