News April 16, 2025
నాగర్కర్నూల్: యాక్సిడెంట్లో చనిపోయింది వీళ్లే..!

నాగర్కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 17, 2026
పాలమూరు: ‘నేడే లాస్ట్.. రిజిస్ట్రేషన్ చేసుకోండి’

నూతన బడ్జెట్పై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యువజన అధికారి వి.కోటా నాయక్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ప్రతిభకనబరిచిన యువత జాతీయస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించి, నేరుగా ప్రధానమంత్రితో సంభాషించే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుందని, 15-29 వయస్సు గలవారు అర్హులని, అర్హత గల యువత ఈనెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Site:https://mybharat.gov.in
News February 17, 2026
అమరావతి: ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళన

రెండు రోజుల విరామం తర్వాత ఉదయం 11 గంటలకు ఏపీ శాసనమండలి సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల నెయ్యి సరఫరాపై వాయిదా తీర్మానం ఇవ్వగా ఛైర్మన్ తిరస్కరించారు. దీనిపై ఆగ్రహంతో ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
News February 17, 2026
జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.


