News March 29, 2025
నాగర్కర్నూల్: రేషన్కార్డు దారులకు శుభవార్త

ఉగాది పర్వదినం నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రేషన్కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేయనున్నారు. మార్కెట్లో సన్నబియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీతో రేషన్కార్డులు కలిగి ఉన్నవారందరికీ ప్రయోజనం కలుగనున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 9, 2025
NIEPVDలో ఉద్యోగాలు

డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<
News November 9, 2025
పూజలో ఏ పూలు వాడాలి? ఏ పూలు వాడొద్దు?

పూజకు జిల్లెడ, గన్నేరు, మారేడు, ఉమ్మెత్త, దత్తరేణు, జమ్మి, నల్లకలువలు చాలా శ్రేష్ఠమైనవి. దాసాని, మంకన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ, తోడిలేని పూలు పూజకు పనికిరావు. ఉమ్మెత్త పువ్వుకు పట్టింపు లేదు. మారేడులో లక్ష్మీదేవి, నల్లకలువలో పార్వతీదేవి, కమలంలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే, కొన్ని దేవతలను వాటికి ఇష్టమైన పువ్వులు, ఆకులతోనే పూజించాలి. కొన్ని పువ్వులను కొందరు దేవతలకు అస్సలు వాడకూడదు. <<-se>>#Pooja<<>>
News November 9, 2025
అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి: VZM కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారార్థం రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ వివరాలతో పాటు అర్జీలను సమర్పించాలని సూచించారు. అర్జీల స్థితి కోసం కాల్ సెంటర్ 1100 ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు.


