News April 11, 2025

నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి పోటెత్తిన భక్తులు 

image

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సళేశ్వరం లింగమయ్య జాతరకు భక్తులు పోటెత్తారు. కాలినడకన వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. లోయలు ఉన్నందున చిన్నపిల్లలను తీసుకొచ్చే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు.   

Similar News

News April 18, 2025

IPL: ఆగని వర్షం.. టాస్ ఆలస్యం

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కొనసాగుతోంది. దీంతో 7 గంటలకు పడాల్సిన టాస్ వాయిదా పడింది. మ్యాచ్ కూడా కొంత ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. లేట్‌గా స్టార్ట్ అయినా మధ్యలో వర్షం రాకపోతే పూర్తి 40 ఓవర్ల ఆట యథావిధిగా జరుగుతుంది.

News April 18, 2025

నెల్లూరు: ఒకేసారి రూ.5వేలు పెరిగిన ధర

image

నెల్లూరు జిల్లాలో కొంతమేర నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్‌లో లూజు బస్తా శుక్రవారం రూ.7వేల నుంచి రూ.9వేలు పలికింది. మంచు ప్రభావం తగ్గి వేసవితాపం పెరగడంతో ఢిల్లీలో మార్కెట్ ఊపందుకుంది. 15 రోజుల కిందట రూ.4,500 ఉన్న ధర ఒకేసారి రూ.5 వేలు పెరిగి రూ.9వేలకు చేరింది. దీంతో రైతులు చెట్లకు ఉన్న కాయలు జాగ్రత్తగా కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, కేరళకు తరలిస్తున్నారు.

News April 18, 2025

వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడింది: విశాఖ ఎంపీ

image

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విశాఖలో 33 ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, రుషికొండ ప్యాలెస్‌కు రూ.450కోట్లు YCPప్రభుత్వం ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ, విశాఖలో TCSకు ప్రతిపాదనలు చేశామన్నారు.

error: Content is protected !!