News March 26, 2025

నాగర్‌కర్నూల్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా NGKL డీసీసీ చీఫ్‌గా అచ్చంపేట MLA వంశీకృష్ణ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం KVN రెడ్డి, విజయ్ రెడ్డి, హబీబ్, ప్రతాప్ గౌడ్, మరో ఇద్దరు ఆశావహులుగా ఉన్నారు.

Similar News

News September 14, 2025

విజయవాడలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

image

విజయవాడ నగర వ్యాప్తంగా, రూరల్ ప్రాంతాల్లో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ.190గా ఉంది. స్కిన్ లెస్ కేజీ రూ. 250, స్కిన్ కేజీ రూ.250 విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే కేజీకి 10 రూపాయలు ఎక్కువగా ఉంది. మటన్ కేజీ రూ. 980గా ఉంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News September 14, 2025

అనకాపల్లి: ఢిల్లీ సదస్సుకు కొత్తూరు సర్పంచ్

image

నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 15 న జరిగే సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు సర్పంచ్ ఎస్ లక్ష్మీప్రసన్నకు ఆహ్వానం అందింది. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 75 మంది సర్పంచులను సదస్సులకు ఆహ్వానించగా ఏపీ నుంచి ఆరుగురు ఉన్నారు. వారిలో కొత్తూరు సర్పంచ్ ఒకరు కావడం విశేషం. ఈ మేరకు ఆమె ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.

News September 14, 2025

HYD: నేడు గాంధీ మెడికల్ కాలేజీ వ్యవస్థాపక దినోత్సవం

image

సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాల నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గాంధీ కళాశాల ప్రాంగణంలోని అలుమ్ని భవనంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డా.జీఆర్ లింగమూర్తి, వెంకటరత్నంలు తెలిపారు. కాగా.. గాంధీ మెడికల్ కళాశాల దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్పత్రిగా నిలిచింది.