News April 2, 2025
నాగర్ కర్నూల్: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

ఆకతాయిల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా పోలీస్ షీటీమ్స్ను సంప్రదించి వేధింపుల నుంచి విముక్తి పొందాలని యువతులకు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వరరావు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ కోసం పోలీస్, షీ టీం బృందాలు పర్యటిస్తూ బస్టాండ్లు, విద్యాసంస్థలు, గ్రామ స్టేజీల్లో నిఘా ఉంచుతామని, మహిళల రక్షణే షీటీం ప్రధాన లక్ష్యమన్నారు.
Similar News
News April 3, 2025
రాయితీ ఈ నెల వరకు: కలెక్టర్ హనుమంతరావు

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్ )లో 25 శాతం రాయితీని ఈ నెల వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 3, 2025
సంగారెడ్డి: 56 ఇళ్లకు ఇందిరమ్మ నిధులు విడుదల

జిల్లాలో బేస్ మీట్ వరకు పూర్తి చేసిన 56 ఇళ్లకు లక్ష చొప్పున రూపాయల నిధులు వారి ఖాతాలో జమ చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లో 1200 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు కూడా బేస్ మీట్ వరకు నిర్మిస్తే లక్ష చొప్పున నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు.
News April 3, 2025
పాయింట్స్ టేబుల్ టాప్లో పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025లో రెండు వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికల పంజాబ్ కింగ్స్ టాప్లో నిలిచింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి ఎరగకుండా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు టాప్లో ఉన్న ఆర్సీబీ.. గుజరాత్పై ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత GT, MI, LSG, CSK, SRH, RR, KKR కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే SRH vs KKR మ్యాచ్ తర్వాత సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది.