News December 26, 2025

నాగర్ కర్నూల్: కవిత పర్యటన వివరాలు

image

ఎమ్మెల్సీ కవిత శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏలూరు పంప్ హౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 11 గంటలకు పెంట్లవెల్లిలో రుణమాఫీ కాని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మెడికల్ కాలేజ్, వట్టెం రిజర్వాయర్, సిర్సవాడ బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

Similar News

News December 30, 2025

కృష్ణా: అజ్ఞాతంలో వల్లభనేని వంశీ

image

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. 2024 జూన్ 7న సునీల్‌పై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న మాచవరం పోలీసులు వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి వంశీ కనిపించకపోవడంతో, అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మొన్నటి వరకు నియోజకవర్గంలో ఆక్టివ్‌గా ఉన్న వంశీ సడన్‌గా అదృశ్యమయ్యారు.

News December 30, 2025

సంగారెడ్డి: స్పీడ్‌గా వెళ్లి చెట్టును ఢీకొట్టాడు..!

image

సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీంపూర్ RDO ఆఫీస్ దగ్గర ఈరోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు పరిధి ఇస్నాపూర్‌కు చెందిన యువకుడు బగ్గు రామారావు తన స్కూటీపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 30, 2025

VZM: ‘కూటమి విద్య, వైద్య విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది’

image

కూటమి ప్రభుత్వం నేడు విద్య, వైద్య విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని జిల్లా పరిషత్ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. నేడు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్నే నేడు కూటమి అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారన్నారు. కొత్తగా జిల్లాకు ఏదైనా పరిశ్రమని తీసుకొని వచ్చారా? అని ప్రశ్నించారు.