News November 26, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత..!

నాగర్ కర్నూల్ జిల్లాలో గత రెండు రోజులుగా విపరీతంగా చలి తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కల్వకుర్తి మండలం తోటపల్లిలో అత్యల్పంగా 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి 15.3, యంగంపల్లి 15.4, బొల్లంపల్లి 15.6, కొండనాగుల 16.0, పెద్దముద్దునూరు 16.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. దీంతో ఉదయం వేళలో ప్రజలు చలి తీవ్రతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Similar News
News November 26, 2025
ఏలూరు: ఒడిశా టూ హైదరాబాద్ అక్రమ రవాణా

పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి పోలీసులు బుధవారం నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగుచూసింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తున్న గోవులను గుర్తించి పట్టుకున్నారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
ములుగు: అధికార పార్టీలో అభ్యర్థిత్వంపై పోటీ..!

ములుగు జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు బరిలో ఉండాలనే విషయంపై పోటీ నెలకొంది. కాంగ్రెస్ పవర్లో ఉండటంతో ఆ పార్టీలోనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇద్దరి కంటే ఎక్కువమంది పోటీకి ఆసక్తి చూపుతుండగా నేతలకు తలనొప్పిగా మారింది. జనరల్ రిజర్వేషన్, మేజర్ పంచాయతీలలో ఈ పరిస్థితి ఉంది. ముఖ్య నేతలు సర్దుబాటు చేయకుంటే తిప్పలు తప్పేలా లేవు. మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు.


