News March 2, 2025
నాగర్ కర్నూల్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

✓నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో స్వయం స్వపరిపాలన దినోత్సవం నిర్వహణ.
✓నాగర్ కర్నూల్ జిల్లాలో రేపటి నుండి రంజాన్ మాస ఉపవాస అధ్యక్షులు ప్రారంభం.
✓జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.
✓వంగూరు మండలం కొండారెడ్డిపల్లి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలత పదవి విరమణ.
✓ముస్లిం సోదరి సోదరీ మణులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.
Similar News
News February 10, 2026
సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికలకు భారీ బందోబస్తు

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీ ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో మార్కింగ్ వేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రంలో కూడా ఎవరు కూడా ఇతరులతో మాట్లాడవద్దని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 10, 2026
TU: తెలంగాణ వర్సిటీ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రేటెడ్ పీజీ మొదటి సెమిస్టర్, మరియు IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్ను వర్సిటీ విడుదల చేసింది. ఈనెల 17 నుంచి మార్చి 2 వరకు జరగనున్నాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అర్హులైన విద్యార్థులు పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు.
News February 10, 2026
GNT: సేవలో భేష్.. సాగు, పరిశ్రమల్లో ‘A’ గ్రేడ్

గుంటూరు జిల్లా సేవా రంగంలో రూ.45,344 కోట్లతో రాష్ట్రంలో 3వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో 12.77% వృద్ధి సాధించింది. అయితే వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో మాత్రం జిల్లా ‘A’ గ్రేడ్కే పరిమితమైంది. సాగులో నీటి వినియోగం, పరిశ్రమల్లో మౌలిక వసతులు పెంచితేనే ‘A+’ సాధ్యమని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లే జిల్లాకు దన్నుగా నిలుస్తున్నాయి.


