News June 11, 2024
నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థికి ఎడ్సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్
బిజినెపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ బీఈడీ ప్రవేశ పరీక్ష ఎడ్సెట్లో సత్తా చాటాడు. ఈ ప్రవేశ పరీక్షలో 150 మార్కులకు గాను 118 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ గ్రూప్-1,2కు ప్రిపేర్ అవుతున్నారు. చదువుకొని రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నవీన్ కుమార్ను గ్రామస్థులు, పలువురు అభినందించారు.
Similar News
News September 30, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలిలా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా చిన్నతండ్రపాడులో 35.4 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్లో 33.2 డిగ్రీలు, వనపర్తి జిల్లా గణపూర్లో 32.7 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 31.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News September 30, 2024
జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ఫ్లో
జూరాలకు ఇన్ ఫ్లో తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 72 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు వివరించారు. 4 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లను కొనసాగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గేట్ల ద్వారా, ఆవిరిరూపంలో, విద్యుదుత్పత్తి నిమిత్తం, కాల్వలకు ఇలా మొత్తంగా 68,647 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News September 30, 2024
నల్లమలలో టైగర్ సఫారీ రెడీ
నల్లమలలో నేటితో మూడు మాసాల నిషేధం ముగియనుంది. రేపటి నుంచి టైగర్ సఫారీ సేవలను అటవీశాఖ పున:ప్రారంభించనుంది. పర్యాటకులు టైగర్ స్టే నల్లమల పేరుతో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం వెళ్లి వచ్చే పర్యాటకుల కోసం ఆఫ్లైన్లో పరాహాబాద్ చౌరస్తా నుంచి సఫారీ వాహన సేవలను అందిస్తోంది. ఈ వాహనాల్లో వెళ్తూ అడవి అందాలను, పెద్దపులులు, చిరుతలు, వివిధ రకాల, జంతువులు, పక్షులను ప్రత్యక్షంగా చూడొచ్చు.