News October 18, 2025
నాగర్ కర్నూల్: నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు

42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. జిల్లాలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడి పూర్తి సహకారం అందించడంతో బంద్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో కొనసాగించాలని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News October 18, 2025
అఫ్గాన్ నుంచి టిప్స్ తీసుకోండి.. BCCI, కేంద్రంపై శివసేన ఫైర్!

పాక్ దాడుల్లో క్రికెటర్ల మృతితో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో Asia Cupలో పాక్తో టీమ్ ఇండియా ఆడటాన్ని గుర్తు చేస్తూ శివసేన(UBT) ఫైర్ అయింది. క్రీడల కంటే దేశానికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో Afghan నుంచి BCCI, కేంద్రం టిప్స్ తీసుకోవాలని మండిపడింది. PAKతో సిరీస్ను Afghan రద్దు చేసుకోవడం ఆనందం కలిగించిందని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.
News October 18, 2025
నిర్మల్: సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ ఏర్పాటు

జీవో నంబర్ 317 ప్రకారం తమ సొంత జిల్లా స్థాయి కేడర్లో మారి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ కోరే ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారికి సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే 9000906181 నంబర్కు సంప్రదించాలన్నారు. దీంతో సాంకేతిక సమస్యలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.
News October 18, 2025
యాదాద్రి: అనుకూలిస్తున్న వాతావరణం.. కొనుగోళ్లకు సిద్ధం

జిల్లాలో వరుస వానలతో భయపెట్టిన వరుణుడు గత 3 రోజులుగా కాస్త కరుణించాడు. ప్రస్తుతం వాతావరణం రైతులకు అనుకూలంగా ఉంది. ఉదయం పొగమంచు, ఆ తర్వాత ఎండ వస్తుండటంతో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, పత్తిని రైతులు ఎండబెడుతున్నారు. తిరిగి వరి కోతలు ప్రారంభించి, ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కేంద్రాలను సిద్ధం చేయడంతో కొనుగోలు ప్రక్రియ త్వరలో మొదలుకానుంది.