News March 22, 2025

నాగర్ కర్నూల్: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT

Similar News

News September 16, 2025

హైదరాబాద్‌లో వర్షాల తీరిదే..!

image

HYDలో ఏడాదిలో కురుస్తున్న వర్షాల తీరు పరిశీలిస్తే ‘కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి’ అన్నట్లుగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. వర్షం ప్రారంభమైన గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా కురుస్తోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో ఒకే చోట వరదలు ముంచెత్తి, ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News September 16, 2025

DSC: జిల్లాలో మిగిలిపోయిన 56 పోస్టులు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 807 పోస్టులకు డీఎస్సీ-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 775 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవగా, 755 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉద్యోగ అర్హత పత్రాలు అందించనున్నారు. కొన్ని కేటగిరీలలో అభ్యర్థులు లేక జిల్లాలో 56 పోస్టులు మిగిలాయి.

News September 16, 2025

పార్వతీపురం: నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తుల స్వీకరణ

image

నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్హత పొందిన వారికి ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు ఆర్థిక సాయం అందజేయనుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఏపీలో రిజిస్టర్ కాబడిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ డ్రైవర్లు అర్హులన్నారు.