News August 28, 2025

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మూలపురుషుడు ఎవరో తెలుసా?

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలపురుషుడిగా ముక్త్యాల రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ పేరుగాంచారు. జగ్గయ్యపేట సంస్థానంలోని ముక్త్యాల సంస్థానాధీశుడైన ఆయన, నాటి దట్టమైన అడవి ప్రాంతమైన నందికొండలో సాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాల భూమిని దానం చేసి, రూ. లక్షలాది వెచ్చించారు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా పాలకులను ఒప్పించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కీలకపాత్ర పోషించారు.

Similar News

News August 29, 2025

జనగామ: యాంకర్ లోబోకు జైలు శిక్ష

image

యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధిస్తూ జనగామ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. రఘునాథపల్లి ఎస్సై నరేష్ కథనం ప్రకారం.. 2018లో రఘునాథపల్లి మండలంలో అతివేగంగా కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడింది.

News August 29, 2025

రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలి: DGP

image

నెల్లూరు జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా పోలీసులను ఆదేశించారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షపై రివ్యూ నిర్వహించారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

News August 29, 2025

మంథని: ‘లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

గోదావరినదిలో వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మంథని పట్టణంలోని గోదావరితీరాన్ని ఆయన పరిశీలించారు. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.