News November 8, 2024

నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

నాగార్జున యూనివర్సిటీ ఆగస్టులో నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఏ. శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 9205 మంది పరీక్షలు రాయగా వారిలో 6,923 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఒక్కో పేపర్‌కు రూ.1,680 చెల్లించి ఈ నెల 15 తేదీలోగా కళాశాలలకు సమర్పించాలని శివప్రసాదరావు సూచించారు. ఫలితాలు www.anu.ac.inలో పొందవచ్చని పేర్కొన్నారు. 

Similar News

News September 15, 2025

గుంటూరు: DSC-2025 రిక్రూట్మెంట్ జాబితా చెక్ చేస్కోండి

image

గుంటూరు జిల్లాలో మెగా డీఎస్సీ-2025 కి సంబంధించిన అన్ని కేటగిరీల రిక్రూట్‌మెంట్ జాబితాను deognt.blogspot.com వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. ఈ జాబితాను డీఈవో కార్యాలయం, కలెక్టరేట్‌లోని డిస్‌ప్లే బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.

News September 15, 2025

మహిళల ఆరోగ్యంపై శిబిరాలు: DMHO

image

‘స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్’ పేరిట జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ శిబిరాలలో మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, గర్భాశయ క్యాన్సర్, రక్తహీనత వంటి వ్యాధులను గుర్తించి, చికిత్సలు అందిస్తారు. గర్భిణులకు పరీక్షలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

News September 15, 2025

సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ వకుల్

image

పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.