News January 30, 2025

నాగోబా ప్రజాదర్బార్‌కు 83 ఏళ్ల చరిత్ర

image

నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి, భుక్తి, విముక్తి కోసం కొమురం భీం పోరాటం చేసి మరణించాడు. అప్పుడు గిరిజనుల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ ADBజిల్లాకు వచ్చారు. గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి నాగోబా జాతర వేదిక కావాలని ఆయన భావించి 1942లో నిర్వహించాడు. అప్పటి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు.

Similar News

News December 20, 2025

NZB: నకిలీ నోట్లతో బ్యాంకర్ల అలెర్ట్

image

వర్ని బ్యాంకులో ఏకంగా రూ.2లక్షలకుపైగా నకిలీ నోట్లు బయట పడడంతో జిల్లా మొత్తం బ్యాంకర్లు అలెర్ట్ అయ్యారు. GP ఎన్నికల్లో నకిలీ నోట్లు పంపిణీ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపాజిట్ చేసేందుకు డబ్బు ఎవరు తెచ్చినా బ్యాంకు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్నటి వరకూ ఒకటి రెండు దొంగ నోట్లు అనే పరిస్థితి నుంచి అన్ని నోట్లు పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News December 20, 2025

KMR: అడవిలో ఏముంది సోదరా!

image

అధునాతన భారతావని మించి అడవిలో ఏముంది సోదరా.. జనజీవన స్రవంతిని మించి స్వతంత్రమేమి లేదురా. KMR జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి @ సంతోష్ నిన్న HYDలో DGP సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. తన జీవితంలో విలువైన 25 ఏళ్ల సమయాన్ని వృథా చేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు ఇంతకాలం ఎదురు చూసి తపించిపోయారు. అతని రాకకు కుటుంబసభ్యులు, గ్రామస్థులు వేచిచూస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

News December 20, 2025

ICMRలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ICMRలో 28 సైంటిస్ట్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/